భారతీయ జనతా పార్టీ నిర్వహించిన “స్వచ్ఛ భారత్” కార్యక్రమంలో భాగస్వామ్యం అయిన సాయుధ దళాలు..


నేడు విశాఖపట్నం ఆర్.కె.బీచ్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారి అద్వర్యంలో బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ శ్రీ పి.వి.ఎన్ మాధవ్ గారి నిర్వహణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గారు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఆంధ్రప్రదేశ్ బీజేపీ సహా ఇంఛార్జ్ శ్రీ సునీల్ దేవధర్ గారు గౌరవ అతిధిగా విచ్చేశారు.
సముద్రం ఒడ్డున పరిసరాలను బీజేపీ నేతలు,సాయుధ దళాల సైనికులు పరిశుభ్రంగా చేశారు.అలాగే ప్లాస్టిక్ రహిత గుడ్డ సంచుల వినియోగం వల్ల ఉపయోగాలుపై బీచ్ కు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిధి శ్రీ జి.కిషన్ రెడ్డి గారు,రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ నిరంతరం అంకితభావంతో దేశానికి సాయుధ దళాల సైనికులు చేస్తున్న సేవ గొప్పదని,వారు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకోవడం స్ఫూర్తిదాయకమని వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నేతలు,బీజేపీ స్థానిక నాయకులు మరియు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

About The Author