ఏపీలో ఇసుక కొరతపై బాబు దీక్ష పవన్ మద్దతు…


ఏపీలో ఇసుక కొరత వలన భావన కార్మికులు రోడ్డున పది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ప్రతిపక్షాలు ఏదొక రీతిలో నిరసన చేస్తున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ మిలియన్ మార్చ్ చేస్తే ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. భవన నిర్మాణ కార్మికుల్లో భరోసా పెంచేందుకు తెదేపా అధినేత చంద్రబాబు దీక్ష చేపట్టారు. విజయవాడలోని ధర్నాచౌక్‌లో ”12 గంటల నిరసన దీక్ష”కు దిగారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. మరోవైపు ఈ దీక్షకు భాజపా, జనసేన పార్టీలు తమ మద్దతు ప్రకటించాయి.
నాలుగు నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరత కొనసాగుతుంది.వరద కారణంగా కొరత కొనసాగుతుందని ప్రభుత్వం తెలుపగా…. ముందు చూపులేని ప్రభుత్వ విధానాల వల్లనే ఈ సమస్యలు ఏర్పడ్డాయని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.

About The Author