ఇవ్వాళ తెరుచుకోనున్న శబరిమల ఆలయం…


తిరువనంతపురం:

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో..

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం నేడు తెరుచుకోనుంది.

దేవాలయ ప్రధాన పూజారి కందరారు మహేశ్‌ మోహనరు, ముఖ్య పూజారి సుధీర్‌ నంబూద్రి శనివారం సాయంత్రం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారు.

ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించే విషయంలో కేరళ ప్రభుత్వం పలు ఆదేశాలు జారీ చేసింది.

ఆలయాన్ని సందర్శించాలనుకునే మహిళలు సంబంధిత కోర్టు ఆర్డరుతో రావాలని స్పష్టం చేసింది.

About The Author