శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం వి ఐ పి దర్శన సమయంలో పలువురు ప్రముఖులు

దర్శించుకున్నారు. దర్శించుకున్న వారిలో నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ రాం శంకర్ కటారియా, నటి విజయశాంతి ఉన్నారు. వీరికి టిటిడి అదనపు ఈఓ ఏ.వి ధర్మారెడ్డి, ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్ దగ్గరుండి దర్శన ఏర్పాట్లను చేశారు. రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు వేదశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

About The Author