భారత ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం 

తిరుపతి, నవంబర్ 23: తిరుమల శ్రీవారి దర్శనార్థం శనివారం మద్యాహ్నం 2.10 గంటలకు  రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న భారత ప్రధాన న్యాయమూర్తి (Hon’ble Sri S.A. Bobde, Chief Justice of India) గౌరవ ఎస్.ఎ.బొబ్డే గారికి ఘనస్వాగతం లభించింది. గౌరవ ఆంద్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె.కె మహేశ్వరి, జిల్లా కలెక్టర్ డా.ఎన్.భరత్ గుప్త, చిత్తూరు జిల్లా న్యాయమూర్తి రవీంద్రబాబు, తిరుపతి మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి వీర్రాజు, హైకోర్ట్ రిజిస్టార్ పురుషోత్తం కుమార్ , నగరపాలక కమిషనర్ పి.ఎస్.గిరిషా, అర్బన్ ఎస్.పి.గజరావు భూపాల్, తిరుపతి ఆర్డీఓ కనక నరసా రెడ్డి, రేణిగుంట తహశీల్దార్ విజయసింహా రెడ్డి , బార్ అసోషియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు  స్వాగతం పలికిన వారిలో వున్నారు. అనంతరం శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల బయలుదేరి వెళ్లారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకుని ఉదయం 10.15 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని డిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. — డివిజనల్ పి.ఆర్.ఓ.,తిరుపతి

About The Author