ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి…

https://www.facebook.com/322621841767817/posts/424041474959186/
జనగామ జిల్లాలోని లింగాలఘణపురం మండలం చీటూరు గ్రామం వద్ద పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాన్వాయ్‌లోని బులెట్ ప్రూఫ్ కారు ప్రమాదానికి గురైంది. అదుపుతప్పిన కారు ప్రమాదానికి గురి అయ్యింది. ఇందులో కారు డ్రైవర్ పార్ధ సారధి(30), సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ(27) అక్కడికక్కడే మృతి చెందగా… వాహనంలో ప్రయాణిస్తున్న గన్‌మెన్‌ నరేశ్‌, అటెండర్‌ తాతారావు, శివ ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన సిబ్బందితో కలిసి హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరో వెనుక కారులో ప్రయాణిస్తుండటంతో తనకు ఈ ప్రమాదం తప్పింది.

About The Author