గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన బిగ్ బాస్ 2 షో ఫేమ్ భాను శ్రీ..


రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా బిగ్ బాస్ 2 ఫేమ్; సింగర్ రోల్ రైడర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించిన భాను శ్రీ గారు ఈ రోజు మూడు మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా భాను శ్రీ గారు మాట్లాడుతూ మొక్కలను నాటి వాటిని రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి అని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ గారు ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని. ఈ సందర్భంగా సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మరొక ఐదుగురిని మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.1) సినిమా హీరోయిన్ MLA రోజా 2) ఆర్టిస్టు ప్రియా 3) జబర్దస్త్ చమక్ చంద్ర 4) జబర్దస్త్ గెటప్ శీను 5) జబర్దస్త్ అవినాష్ లకు మొక్కలు నాటాలని కొరాది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి; గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ; కిషోర్ పాల్గొన్నారు.

About The Author