తుమ్మల గుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ..


తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి..
* తుమ్మల గుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ..
* పాదయాత్రగా తిరుచానూరు చేరుకున్న ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తుమ్మల గుంట శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం నుంచి ఆనవాయితీగా వస్తున్న పట్టు వస్త్రాలు సమర్పణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా జరిగింది. బుధవారం తుమ్మల గుంట ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తగా ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే, తుడ ఛైర్మెన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పట్టు వస్త్రాలను తిరుచానూరు ఆలయ అధికారులకు సమర్పించారు. అంతకుముందు శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరారు. ఈ క్రమంలో గ్రామ ప్రజలు అడుగడుగునా కర్పూర నీరాజనాలు పలికారు. ఆయా గ్రామాల్లోని ఆలయాలను దర్శించుకుం టూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాదయాత్ర కోలాహలంగా సాగింది. ఈ పాదయాత్రలో చంద్రగిరి నియోజకర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గోవింద నామస్మరణ ల నడుమ భక్తుల పాదయాత్ర భక్తి తత్వంతో సాగింది.

About The Author