చంద్రబాబునాయుడు గారి పై చెప్పులతో దాడి చేయటాన్ని ఖండిస్తున్నాము.


రాజధాని ప్రాంతంలో టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. ఉండవల్లిలోని తన నివాసం నుంచి బాబు ఈ పర్యటనను ప్రారంభించగా.. బస్సులు, కార్లలో టీడీపీ నేతలు ఆయన వెంట వెళుతున్నారు. అయితే మార్గమధ్యంలో ఆయన కాన్వాయ్‌పై ఆందోళనకారులు రాళ్లు, చెప్పులు విసిరారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వారు నినాదాలు చేశారు.

ఇదిలా ఉంటే చంద్రబాబు పర్యటనను కొందరు రాజధాని రైతులు, వైసీపీ వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. కృష్ణానది నుంచి రాయపూడి వరకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన రైతులు అందులో చంద్రబాబుకు ప్రశ్నలు సంధించారు. రాజధాని పేరిట రైతులను మోసం చేసిన చంద్రబాబు మళ్లీ అమరావతికి ఎలా వస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

కాగా మరోవైపు గుంటూరు వెంకటపాలెం సమీపంలో టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. నినాదాలు చేయొద్దంటూ వారిని పోలీసులు హెచ్చరించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ వర్గీయులు నినాదాలు చేస్తున్నారు. మొత్తానికి చంద్రబాబు పర్యటనతో రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ నెలకొంది.

About The Author