తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లకు పడిపోయింది!


తెలుగు సినీనటులపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో తెలుగు వైభవం పేరుతో భాషా పండితులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘చాలా మంది టాలీవుడ్‌ నటులకు తెలుగులో మాట్లాడటం తెలుసో లేదో కానీ తెలుగులో రాయడం అస్సలు తెలియదు.

సినీ పరిశ్రమలో తెలుగు భాష దిగజారిపోతోంది. పరిశ్రమలో పాండిత్యం రానురాను తగ్గిపోతోంది. మన రచయితలకు శాస్త్రాలు, పాండిత్యం తెలియవు. మేడసాని మోహన్ గారిలాంటి అవధానులను ప్రేరణగా తీసుకుంటే గొప్పగొప్ప సినిమాలు వచ్చేవి. తెలుగు సినిమా స్థాయి బూతులు, తిట్లకు పడిపోయింది.

మాతృభాషను మరిచిపోతే వచ్చిన దుస్థితి ఇది. చాలా మంది తెలుగు సినిమా హీరోలు సినిమాలు చేస్తారు.. డబ్బులు ఇక్కడే సంపాదిస్తారు.. కానీ తెలుగు మాట్లాడటం, ఉచ్చరించడం మాత్రం తెలియదు. ఒక తెలుగు హీరోగా నాకు ఇవన్నీ ఆవేదన కలిగించాయి. మన భాష, సంస్కృతులను కాపాడుకోలేకపోతే అధోగతి పాలవుతాం” అని పవన్‌ వ్యాఖ్యానించారు.

About The Author