ఏపి లో 55 ఏళ్ళ మహిళ పై అత్యాచారం, హత్య…!


దిశ అత్యాచారం,హత్య ఘటన మరవకముందే తూర్పుగోదావరి జిల్లా అమలాపురం డివిజన్ జి వేమవరం లో 55 ఏళ్ళ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటన వెలుగు చూసింది.

ఐ పోలవరం మండలం జీ.వేమవరం గ్రామానికి చెందిన 55 ఏళ్ళ మహిళపై గుర్తుతెలియని వ్యక్తులు అత్యాచారం చేసి ,హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఇంటి పరిసరాల్లో నిందితులు కారం చల్లి,ఈ ఘాతుకానికి ఒడిగట్టారు .సంఘటన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి పరిశీలించారు .పోలీస్ క్లూస్ టీం డాగ్ స్క్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. ముగ్గురు అనుమానితులను గుర్తించామని త్వరలో కేసును ఛేదిస్తామని జిల్లా ఎస్పీ నయీమ్ పేర్కొన్నారు .

About The Author