ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం!


మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీ నేతలతో నిన్న వెంకటగిరిలో చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం బీదా మస్తాన్ రావు వైసీపీలో చేరికపై విజయసాయిరెడ్డి, మస్తాన్ రావు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మంత్రి అనిల్ కుమార్ యాదవ్, వైసీపీ యువజన నేత రూప్ కుమార్ యాదవ్ తదితరులతో సమావేశమయ్యారు.

అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిని రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వివరణ అడిగారని చెబుతున్నారు. ఇటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు తాను సహించనని మరోసారి ఇలా చేస్తే పార్టీనుంచి సస్పెండ్ చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా విజయసాయిరెడ్డి కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తానైనా, వేరే నాయకుడెవరైనా ఒకటేనని, క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఈ వివాదం ముదిరి పాకనపడినట్టు అర్థమవుతోంది.

About The Author