మాజీ కౌన్సిల‌ర్‌ను నారా లోకేశ్ ప‌రామ‌ర్శ‌..


అనారోగ్యంతో ఉన్న మాజీ కౌన్సిలర్‌ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు. మంగ‌ళ‌గిరి 17వ వార్డుకి చెందిన టీడీపీ నేత మున‌గాల స‌త్య‌నారాయ‌ణ వార్డు కౌన్సిల‌ర్‌గా కూడా ప‌నిచేశారు. ఇటీవ‌ల గుండె సంబంధిత స‌మ‌స్య‌కు చికిత్స చేయించుకున్నారు. హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయి ఇంటికి చేరుకున్న స‌త్య‌నారాయ‌ణ‌ను మంగ‌ళ‌వారం నారా లోకేశ్ ప‌రామ‌ర్శించారు. ఆరోగ్య ప‌రిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యంగా జాగ్ర‌త్తగా చూసుకోవాల‌ని సూచించారు. ధైర్యంగా ఉండాల‌ని, అండ‌గా ఉంటాన‌ని హామీ ఇచ్చారు. స‌త్య‌నారాయ‌ణ‌ను ప‌రామ‌ర్శించిన వారిలో మాజీ మున్సిప‌ల్ చైర్మ‌న్‌ గంజి చిరంజీవి, టీడీపీ నేత‌లు పోతినేని శ్రీనివాస‌రావు, సంకా బాలాజీ గుప్తా, నందం అబ‌ద్ధ‌య్య‌, ఆరుద్ర భూల‌క్ష్మి, వెల‌గ‌పాటి విలియ‌మ్స్‌, వంగ‌ర ల‌క్ష్మ‌య్య‌, ఉద్దంటి ప‌ద్మావ‌తి, పోల‌వ‌ర‌పు హ‌రిబాబు, ఊట్ల శ్రీమ‌న్నారాయ‌ణ, వాకా మంగారావు, షేక్ ఇబ్ర‌హీం, షేక్ ఇక్బాల్‌, గుత్తికొండ ధ‌నుంజ‌య‌రావు, గాదె పిచ్చిరెడ్డి, తోటా పార్థ‌సార‌ధి, చావ‌లి ఉల్ల‌య్య‌, కోసూరి రాజ‌శేఖ‌ర్‌లున్నారు.

About The Author