రాంగోపాల్ వర్మ పై మరో కేసు..


సీసీఎస్ సైబర్ క్రైమ్స్ లో సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఫిర్యాదు చేసిన కెఏ పాల్ కోడలు.

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ప్రమోషన్ కు తమ ఫోటోలను ఆర్జీవి మార్ఫింగ్ చేసి వాడుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్న బెగాల్ జ్యోతి.

గతంలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో తాము దిగిన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని , ఆర్జీవి పై చర్యలు తీసుకొని ఆ ఫోటోలను తొలగించాలని జ్యోతి కోరింది. ఐపీసీ 469 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. రామ్ గోపాల్ వర్మ ఫోటోలు మార్ఫింగ్ చేసిన ఐపీ నెంబర్ కోసం గూగుల్ లెటర్ పెట్టిన పోలీసులు.

About The Author