బూట్లతో కొట్టుకొంటూ.. వైసీపీ వీరాభిమాని ఆక్రోశం…


*- రేషన్‌, పింఛను ఇవ్వకుండా మా నేతలే అడ్డుకొంటున్నారు
*- చిత్తూరు స్పందనలో గోడు*
*- బూట్లతో కొట్టుకొంటూ..వైసీపీ వీరాభిమాని ఆగ్రహం*

మెడలో బూట్లు, నడుముకు గోనెసంచితో కనిపిస్తున్న ఈయన పేరు రాజమాణిక్యం. ఒకింత నిరాశ, మరింత నిప్పులు కక్కుతున్న ఈ ది వ్యాంగుడు.. వైఎస్‌ కుటుంబానికి విధేయుడు. జగన్‌ సీఎం అయ్యేదాకా జుట్టు తీయనని, గడ్డం చేయనని భీష్మించిన వీరాభిమాని! అలాంటి అభిమానే సర్కారుపై ఆగ్రహించాడు. మెడలోని బూట్లతో తనను తాను కొట్టుకొంటూ సోమవారం చిత్తూరు జి ల్లా కేంద్రంలో జరిగిన ‘స్పందన’లో పాల్గొని, హల్‌చల్‌ సృష్టించాడు. వికలాంగుల పిం ఛను, తెల్ల రేషన్‌కార్డుకు అర్హుడినైనా.. మండల వైసీపీ కన్వీనర్‌ ప్రతా్‌పరెడ్డి చెబితేనే ఇస్తామని తహసీల్దార్‌ చెబుతున్నారని వాపోయాడు. దళితుడినైన తనను అధికారులు పట్టించుకోవడం లేదన్నాడు. పార్టీ అభిమానమూ ఈ విషయంలో కొరగానిదైపోయిందన్నారు.

పార్టీ గెలుపుకోసం పనిచేశానని, ఒకసారి అధికారంలోకి రాగానే కొత్త కొత్త నాయకులు వైసీపీలోకి రావడం మొదలుపెట్టారని రాజమాణిక్యం వాపోయాడు. అనంతరం జేసీ-2 చంద్రమౌళిని కలిసి వినతిపత్రం అందించాడు. రాజమాణిక్యంది చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం కె. పట్నం. పుట్టుకతోనే దివ్యాంగుడు కావడంతో, తన పనులు తాను చేసుకోలేని పరిస్థితి! తొలినుంచీ వైఎస్‌ అంటే అభిమానం. అ అభిమానంతోనే ఆయన చనిపోయినప్పుడు ఇల్లు అమ్మి గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటుచేశాడు. వైఎస్‌ కుటుంబంపై అభిమానంతో జగన్‌ సీఎం అయ్యేంత వరకు జుట్టు, గడ్డం తీయకుండా ఆరు సంవత్సరాలపాటు అలాగే ఉన్నాడు.

About The Author