నీటి లో దాచిన దుంగలతో సహా 16 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం : ఒక స్థానిక స్మగ్లర్ అరెస్టు

తిరుపతి:శ్రీకాళహస్తి సమీపంలో ని మేల్చూరు- వాంపల్లి రోడ్ లో స్కార్పియో వాహనం లో లోడ్ చేసిన 6 ఎర్ర చందనం దుంగలతో పాటు, నీటి గుంటలో దాచిన 10 దుంగలను టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుని, ఒక స్థానిక స్మగ్లర్ ను అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ పి రవిశంకర్ గారి అధ్వర్యంలో ఆర్ ఎస్ ఐ వాసు, పివి నరసింహారావు టీమ్ శ్రీకాళహస్తి సమీపంలో ని మేల్చూరు బీట్ లో శనివారం కూబింగ్ చేపట్టారు. పల్లం అటవీ ప్రాంతంలో ఒక స్కార్పియో వాహనం అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వాహనాన్ని తనిఖీ చేయగా అందులో ఆరు దుంగలతో పాటు సమీపంలోని కాసారాం గ్రామానికి చెందిన బొర్రా బాలసుబ్రహ్మణ్యం (31) ఉన్నాడు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పక్కనే నీటి గుంతలో దాచిన మరో పది దుంగల అచూకీ లభించింది. మొత్తం 16 దుంగలను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ లో ఎస్ ఐ ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

About The Author