దివ్యాంగురాలిపై హత్యాచారం…


ఓ మానసిక దివ్యాంగురాలిని అత్యాచారం చేసి అనంతరం దారుణంగా హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా గూడూరులో వెలుగుచూసింది. గూడూరు సమీపంలోని చవటపాళెంకు చెందిన దివ్యాంగురాలు(29) ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సమీప దుకాణానికి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబీకులు రాత్రంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. సోమవారం ఉదయం స్థానికులు సమీపంలోని పాడుబడిన ఇంటిని పరిశీలించగా దివ్యాంగురాలి కాళ్ల పట్టీలు లభించాయి. అక్కడికి దగ్గరలోని మరో శిథిల భవనంలో ఆమె మృతదేహం లభించింది. దుండగులు ఆమెపై అత్యాచారం చేసి అనంతరం ఆయుధంతో తలపై కొట్టి చంపినట్లు పోలీసులు గుర్తించారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ మృతదేహాన్ని పరిశీలించారు. ఆదివారం రాత్రి దివ్యాంగురాలిని వెతికేందుకు వెళ్లిన ఆమె సోదరుడిని గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అదే సమయంలో బెదిరించినట్లు తెలిసింది. వారు మద్యం మత్తులో ఉన్నారని గ్రహించిన అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు.బెదిరింపుhలకు పాల్పడినవారే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

About The Author