తిరుమల\|/సమాచారం ఓం నమో వేంకటేశాయ!!

ఈరోజుసోమవారం13.01.2020ఉదయం 5 గంటల సమయానికి,నిన్న 75,927 మంది భక్తులకు కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి వారిదర్శన భాగ్యం లభించింది,వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 03 కంపార్ట్మెంట్ లో సర్వదర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు.ఈ సమయం శ్రీవారి సర్వదర్శనాని కి సుమారు03గంటలుపట్టవచ్చును,

నిన్న స్వామివారికిహుండీ లో భక్తులుసమర్పించిన నగదు₹: 2.53 కోట్లు,శీఘ్రసర్వదర్శనం(SSD),ప్రత్యేక దర్శనం (ఆన్లైన్₹300/-),దివ్యదర్శనం(కాలినడక) వారికి శ్రీవారిదర్శనానికి సుమారుగారెండు గంటల సమయం పట్టవచ్చును,

గమనిక

₹:10,000/- విరాళం
ఇచ్చు శ్రీవారి భక్తునికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒకవిఐపి బ్రేక్ దర్శన భాగ్యం కల్పించిన టిటిడి,

ప్రత్యేక దర్శనాలు:
జనవరి 21, 28వ తేదీల్లోవృద్ధులు, దివ్యాంగులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం,
జనవరి 22, 29వ తేదీల్లో 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక
దర్శనం.

తిరుప్పావై

ధనుర్మాసం కాలంలో తిరుమల శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు. సహస్రనామార్చనలో తులసికి బదులు బిల్వపత్రాలతో పూజిస్తారు. ధనుర్మాసం ఉభయ సంధ్యల్లో ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయడం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం తొలగి అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. విష్ణు ఆలయాల్లో ఉదయం అర్చన తర్వాత ప్రసాదాన్ని నివేదించి వాటిని పిల్లలకు పంచుతారు. దీన్నే బాలభోగం అంటారు. సూర్యుడు ధనస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశించే వరకు అంటే భోగి రోజు వరకూ ధనుర్మాసం కొనసాగుతుంది. ఈ నెల రోజులు విష్ణు ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది

About The Author