అందంలో ఇంత కిరాతకమా…? రెండో భర్తను క్రూరంగా చంపింది..


ఈ అందగత్తె మహా కిరాతకురాలు.. రెండో భర్తను ఆమె చంపించిన కిరాతకం వింటే భయమేస్తుంది..బెంగళూరులో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్న రశ్మి బెంగళూరులో ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసే భర్త సుబ్రమణ్యం (36)ని తన సోదరుడు, అతని ఇద్దరు స్నేహితులతో కలిసి కిడ్నాప్‌ చేసి సుమారు ఐదు రోజుల పాటు ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేసింది. సుబ్రమణ్యం చేతి గోళ్ళను పీకివేయడంతోపాటు ఇనుప కడ్డలతో కొట్టి హింసించారు. చివరకు అతని ఇంటివద్ద పడేసి పరారయ్యారు. చుట్టుపక్కల వారు గ్రహించి కొళ్ళెగాలలో ఉన్న ప్రవేట్‌ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స కొసం మైసూరులోని ప్రైవేటు ఆస్పత్రికి తరళించారు. అక్కడ చికిత్స పొందుతూ సుబ్రమణ్యం మంగళవారం చనిపోయాడు. కొళ్ళెగాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు సుబ్రమణ్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రశ్మిని అరెస్టు చేసి విచారిస్తున్నారు. రశ్మికి పెళ్ళి జరిగి సుమారు 11 సంవత్సరాల కొడుకు ఉన్నాడు. భర్తతో గొడవ పడి విడాకులు తీసుకుంది. నాలుగు సంవత్సరాల క్రితం సుబ్రమణ్యంను ప్రేమించి రెండవ పెళ్ళి చేసుకుంది. ఏడాది పాటు బాగానే ఉన్నారు. ఇటీవల అతనితో ఘర్షణ పడి మళ్లీ మొదటి భర్తకు వద్దకు వచ్చి ఆరునెలలు ఉంది. మళ్లీ రెండవ భర్త వద్దకు వెళ్లిపోయింది. సుబ్రమణ్యం నుంచి ఆమె లక్షల రూపాయలు తీసుకుంది. ఆ డబ్బులు ఇవ్వాలని అతడు అడగడం ఆమె ఆగ్రహానికి కారణమైంది.

About The Author