విజయవాడ బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ ట్రయల్‌ రన్‌…


సాయంత్రం నుంచి వాహనాలకు అనుమతి
రూ.80కోట్లతో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
ఏలూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ
దశాబ్దంన్నర తరువాత ఫలిస్తున్న స్వప్నం
రెడీ.. 1.. 2.. 3.. కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి బెంజ్‌సర్కిల్‌ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి రానుంది. ఏళ్ల తరబడి చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్‌కు చెక్‌ పెడుతూ, దశాబ్దంన్నరగా ఊరిస్తున్న కలను సాకారం చేస్తూ మన ముందుకొచ్చి వాలింది. అధికారిక ప్రారంభోత్సవం ప్రస్తుతానికి లేకపోయినా.. ట్రయల్‌ రన్‌తో వాహనాల రాకపోకలకు జెండా ఊపనున్నారు.
త్వరత్వరగా.. బెంజ్‌సర్కిల్‌ మొదటి వరుస పనుల కాంట్రాక్టును దక్కించుకున్న దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థకు 2016, నవంబరులో ఎన్‌హెచ్‌ అధికారులు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో సర్వీసు రోడ్డు వెంబడి చెట్లను తొలగించాల్సి రావటం, డిజైన్‌ మార్పు వల్ల మళ్లీ అలైన్‌మెంట్‌ను నిర్దేశించాల్సి రావటం వల్ల పనుల ప్రారంభానికి 8 నెలల సమయం పట్టింది. 2017, జూలైలో దిలీప్‌ బిల్డ్‌కాన్‌ సంస్థ పనులు ప్రారంభించింది. కిందటి నవంబరులో ఫ్లై ఓవర్‌ను అప్పగించాల్సి ఉండగా, ఒక్క అప్రోచ్‌ తప

About The Author