బీజేపీలోకి వీరప్పన్ కూతురు… తండ్రిపై సంచలన వ్యాఖ్యలు.. తల్లికి షాక్..ఇన్నాళ్లు ఎక్కడ?


గంధపుచెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లర్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందాడు అడవిదొంగ వీరప్పన్. ఒకప్పుడు తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాల్ని గడగడలాడించిన ఆయనను 2004లో సిట్ బృందం మట్టుపెట్టింది. నేరాలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ భార్య ముత్తులక్ష్మీపైనా పోలీసులు కేసులు పెట్టారు. వీరప్పన్ చనిపోయేనాటికి అతనికి ఇద్దరు కూతుళ్లు. ఆ ఇద్దరిలో పెద్దదైన విద్యారాణి(30) ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. సుమారు 3వేల మంది అనుచరులతో కలిసి బీజేపీలో చేరిన విద్యారాణి.. తండ్రిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ఇన్నాళ్లూ ఆమె ఎక్కడ, ఎలా ఉన్నారంటే…

కండువాకప్పిన మురళీధర్ రావు..

తెలంగాణకు చెందిన ప్రముఖ బీజేపీ నేత, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావు ప్రస్తుతం తమిళనాడు వ్యవహారాల ఇన్ చార్జిగా కొనసాగుతున్నారు. ఆంధ్రా-కర్నాటక-తమిళనాడు సరిహద్దులోని క్రిష్ణగిరి జిల్లా కేంద్రంలో శనివారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ఆయన.. వీరప్పన్ కూతురికి కాషాయకండువాకప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. కేంద్ర మాజీ మంత్రి పొన్‌ రాధాక్రిష్ణన్‌ కూడా ఈ వేడుకలో

About The Author