ప్రజలందరికీ విజ్ఞప్తి..


కరోనా అనే వైరస్ ఇవ్వాళ్ళ మొత్తం ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్నది. కరోనా అనే రోగ క్రిమి వల్ల కోవిడ్ 19 అనే జబ్బు వస్తుంది. 2019 డిసెంబర్ లో చైనా లోని ఊహాన్ నగరం లో బయటపడ్డ ఈ వైరస్ 150 దేశాలకు పాకింది. ఇప్పటివరకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చైనా లో సుమారు 5,000 మంది మరణించగా ఇటలీలో ఇంతకు రెట్టింపు 10,000 మంది మరణించారు. ఈ వైరస్ మన దేశం లోకి మన రాష్ట్రం లోకి కూడా ప్రవేశించింది. ఇది ఒకరినుండి ఒకరికి సోకే భయంకరమైన అంటువ్యాధి. నిన్నటిదాకా రాష్ట్రంలోకి వచ్చిన విదేశీయులలోనే కనిపించిన ఈ వ్యాద్షి ఇప్పుడు మన రాష్ట్రంలోనే ఉన్న వారికి కూడా సోకుతున్నది. ఇది ప్రాణాంతకమైన వైరస్. ఇది సోక కుండా ఉండెందుకు వాక్సీన్ ఇంకా కనుక్కోలేదు. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోగాలిగేది కేవలం ముందు జాగ్రత్తల ద్వారా మాత్రమే.
చేతులు జోడించి అందరినీ వేడుకుంటున్నాను. దయచేసి అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొండి. మీరు తీసుకునే జాగ్రత్తల వల్ల మీరు మీ ప్రాణాన్ని కాపాడుకోవటమే కాకుండా వేలాది మంది ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు . మొదటిది మార్చ్ 31 వరకు అందరూ ఇమ్డ్లల్లోనే వుండండి. మంది కూడితే ఈ జబ్బు వేగంగా వ్యాప్తి చెందుతుంది. అందుకని అత్యవర పరిస్థితి ఉంటే తప్ప బయటికి రాకండి అది కూడా కుటుంబానికి ఒక్కరు మాత్రమే.
రెండవ జాగ్రత్త ఎవరైనా విదేశాల నుండి వస్తే వెంటనే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇవ్వండి. వారికి వైద్య పరీక్షలు చేస్తారు . విదేశాలనుండి వచ్చిన వారు జబ్బు ఉన్నా లేకున్నా 14 రోజుల పాటు బయటికి రాకుండా ఇంట్లోనే వుండండి. మామూలుగా ఈ జబ్బు వైరస్ తో కలుషితమైన ప్రాంతాన్ని గానీ, వస్తువులనుగానీ మన చేతులతో తాకి ఆ చేతులతో ముఖాన్ని తాకితే వైరస్ మన శరీరం లోకి ప్రవేశిస్తుంది. అందుకనే నిరంతరం చేతులు సబ్బుతో గానీ సానిటైజర్ తో గానీ శుభ్రం చేసుకొండి. జ్వరమూ ఒళ్ళు నొప్పులు దగ్గు గొంతు నొప్పి, తల నొప్పి వంటి లక్షణాలు ఎవరికీ ఉన్నా వెంటనే వైద్యున్ని సంప్రదించండి.
తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి గుడ్డ అడ్డం పెట్టుకొండి. షేక్ హ్యాండ్ ఇవ్వడం మానేయ్యండి. దూర ప్రయాణాలు చెయ్యకండి. ఫంక్షన్లు వాయిదా వేసుకోండి. మిమ్మల్ని కరోనా నుంచి రక్షించేందుకు ప్రభుత్వ వ్యవస్థ అప్రమత్తంగా సేవలందిస్తున్నది గౌరవ ముఖ్యమంత్రిగారు స్వయంగా నిరంతరం పర్య వేక్షిస్తున్నారు . దయచేసి వీధుల్లోకి రాకండి. నాకేం అవుతుందిలే అనే మీ అజాగ్రత్త , మీ నిర్లక్ష్యం వల్ల మానవ వినాశనానికి మీరు కారణం అవుతారు. పరిస్థితి లో ఉన్న గంభీరతను గమనించండిఇటలీ దేశానికి పట్టిన గతి మనకు పట్ట వద్దంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఇంట్లోనే వుండండి. సురక్షితంగా ఉండండి. ఒకరి నుండే ఒకరికి వ్యాపించే గొలుసు కట్టును చేధించడం ద్వారానే కరోనా ను కట్టడి చేయగలుగుతాం . ప్రభుత్వ ఆజ్ఞలు మీరి ప్రవర్తిస్తే జరీమానాలు విధించటం తో పాటు కేసులు కూడా బుక్ చేయవలసి వస్తుంది.
పోలీసులకు సహకరించండి. విజ్ఞతతో ప్రవర్తించండి. జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేసినట్టే మార్చ్ 11 వరకు ఉన్న లాక్ దౌన్ అంటే సకలం బంద్ ను కూడా విజయవంతం చేయండి. సిద్ధిపేట పౌరులుగా మనం అన్నిట్లో ముందున్నాం. కరోనా నివారణ లోనూ ముందుందాం.. మరోసారి మీ అందరికి చేతులు ఎత్తి నమస్కరించి చెప్తున్నా ఇంట్లనే ఉండండి సురక్షితంగా ఉండండి.
జై తెలంగాణ..! జైహింద్..!!

About The Author