దేశ ప్రధాని మోదీజీ మీద జోకులు ఎందుకు వేస్తున్నారు?


మీకు తెలుసా?
ప్రపంచ వ్యాప్తంగా కరోనా భారిన పడి ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా అడ్డుకోగల్గింది ఒక మోదీజి నే అని !

మీకు తెలుసా?
అన్ని దేశాధినేతలు రెవెన్యూ కోసం వారి ప్రజల ప్రాణాలను పనంగా పెట్టి చోద్యం చూస్తున్నరు, అదే సమయంలో మోదీజి రెవెన్యూ ను చూసుకోకుండా వెంటనే లాక్ డౌన్ ని, ప్రకటించి సహోసపరమైన నిర్ణయం తీసుకున్నారు, నిజమే దీని వల్ల దేశంలోని పేదవారు చాల కష్టాలు పడ్డారు కానీ ప్రాణాలతో అయితే ఉన్నారు ( ప్రాణాలు కన్నా ఏది ముఖ్యం కాదుగా )

మీకు తెలుసా?
లాక్ డౌన్ ప్రకటించగానే మోదీజీ నెక్స్ట్ ఆలోచించింది పేదవారి గురించే, వెంటనే 1 లక్ష 70 వేల కోట్ల రూపాయలు ను విడుదల చేసి, రానున్న మూడు నెలలు బియ్యం, పప్పు, గోదాములు ను పేదవారికి ఉచితంగా ఇచ్చారు.
ఈ క్లిష్ట పరిస్థితిల్లో డాక్టర్స్, పోలీసులు, పారిశుధ్య కార్మికుల సేవలు చాల ముఖ్యం అందుకని వీళ్ళు మనోదైర్యాన్ని కోల్పోకుండా దైర్యంగా పనిచేసేలా వారికీ 50 లక్షల ఇన్సూరెన్స్ ను ప్రకటించాడు.

మీకు తెలుసా?
ఎప్పటికిఅప్పుడు అన్ని రాష్ట్రాల సీఎం లతో మీటింగ్స్ పెడుతూ రాష్ట్రాల స్థితి ని తెలుసుకుంటూ సీఎం లకు సూచనలు, సహాయాలు చేస్తూ సీఎం లకు ధైర్యాన్ని ఇచ్చారు.

మీకు తెలుసా?
ప్రజలకు సహాయాలు అందించే స్కీమ్స్ ను తన మంత్రుల ద్వారా ప్రకటనలు చేయించి, తాను వెనుక ఉంటాడు, పేరు కోసం పాకులాడని గొప్ప నాయకుడు అయ్యా ఈ మోదీ, ఈయన కేవలం ప్రజల వల్ల మంచి జరిగితే దాని ఐక్యతను ప్రపంచానికి చాటడానికి మాత్రమే చప్పట్లు, దీపాలు వెలిగించండి అని చెప్పడానికే మాత్రమే ప్రజల ముందుకు వస్తారు, ఇప్పుడు కనపడే ఫలితాలు వెనుక మోదీజి కష్టం, ఆర్థిక, సామజిక వ్యూహాలు ఉన్నాయి అని గుర్తించలేక, ఈ మోదీ ఏంది దీపాలు , చప్పట్లు కొట్టమంటున్నాడు అని కొందరు అజ్ఞానులు ఎక్కిరిస్తున్నారు.

మీకు తెలుసా?
ఈ కరోనా వల్ల భారత్ లో కోట్ల మంది చనిపోవడం ఖాయం అని చెప్పిన దేశాధి నేతలు, WHO అధికారులు ఇప్పుడు మోదీజీ చర్యలు ప్రపంచానికే ఆదర్శం అంటూ ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు, Modi ur The Leader అంటూ సెల్యూట్ కొడుతున్నారు.

ఇప్పుడు ఇంట్లో కూర్చొని అయన మీద జోకులు వేస్తున్నావు అంటే? అది కూడా అయన పుణ్యమే అని తెలుసుకో

నోట్: నేను ఏమి బీజేపీ కార్యకర్తను కాదు, ఒక భారతీయుడు గా నేను గమనించిన వాస్తవాలను చెప్పను.

About The Author