కర్ణాటక మధ్యం(లిక్కర్) పాకెట్స్ ను పట్టుకున్న ఐజ పోలీసులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను జిల్లా లో పోలీసులు పకడ్బందీగా అమలుచేయడం తో కర్ణాటక రాష్ట్రo నుండి అక్రమంగా మద్యం( లిక్కర్) ప్యాకెట్లను తీసుకవచ్చి గ్రామంలో అమ్మేo దుకు సిద్ధమవగా పక్క వ్యూహం తో ఐజ పోలీసులు దాడులు చేసి పట్టుకోవడం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే ఐజ మండలం ఈడిగోనిపల్లి గ్రామానికి చెందిన ఎల్లప్ప అనే వ్యక్తి జిల్లా లో మందు దొరకక పోవడం తో కర్ణాటక రాష్ట్రo రాయచూరు జిల్లా నుండి మద్యం( లిక్కర్ ) ప్యాకెట్లు తీసుకుని వచ్చి తన కిరణం షాప్ లో విక్రయించేందుకు సిద్ధమవుతుండగా పోలీస్ లకు అందిన పక్క సమాచారం తో జిల్లా *ఎస్పీ శ్రీమతి కె. అపూర్వ రావు, IPS* గారి ఆదేశాల మేరకు ఐజ ఎస్సై జగదీష్ గారు   తన సిబ్బంది తో కలిసి దాడులు నిర్వహించి 94 ప్యాకెట్ల లిక్కర్(ఒక ప్యాకెట్ -90ml)ను స్వాధీనం చేసుకొని ఎక్సైజ్ శాఖ అధికారులకు అప్పగించడం జరిగింది.

 

About The Author