అమెరికాకు చేరిన క్లోరోక్విన్‌ మాత్రలు…


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థన మేరకు భారత్‌ పంపిన హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సహా ఇతర ప్రాణాధార ఔషధాలు అమెరికాకు చేరాయి.

• ప్రత్యేక కార్గో విమానంలో పంపిన ఈ మందులు శనివారం సాయంత్రం న్యూజెర్సీలోని నెవార్క్‌ అంతర్జాతీయ విమానానికి చేరుకున్నట్లు అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్‌ సంధు వెల్లడించారు.

• కొవిడ్‌-19 చికిత్సలో క్లోరోక్విన్‌ మాత్రలు ఆశాజనక ఫలితాలు ఇస్తున్నాయని.. వీటిని రోగులు, వారికి దగ్గరగా ఉండేవారికి ఇవ్వొచ్చని ‘ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌’‌(ఎఫ్‌డీఏ) సూచించిన విషయం తెలిసిందే.

• అమెరికాలో వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయానికి ఆ దేశంలో 5,33,259 మంది వైరస్‌ బారినపడగా.. వీరిలో 20,597 మంది మృత్యువాతపడ్డారు. ప్రతిరోజు రికార్డు స్థాయిలో మరణాలు నమోదవుతున్నాయి.

• ఈ తరుణంలో చికిత్సలో కీలకంగా భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ అమెరికాకు చేరడం అక్కడి ప్రభుత్వానికి ఉపశమనం కలిగించే విషయమని చెప్పొచ్చు.

• వీటి ఎగుమతులపై భారత్‌ నిషేధం విధించింది. కానీ, ప్రపంచ దేశాల నుంచి డిమాండ్‌ పెరగడంతో మానవతా దృక్పథంలో వ్యహరించిన భారత్‌ నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేసింది.

• భారత అవసరాలకు సరిపడా నిల్వలు ఉంచుకొని మిగిలిన వాటిని ఆయా దేశాలకు సరఫరా చేస్తోంది. “`

About The Author