అటవీప్రాంతంలో బాలరాజు పర్యటన…


పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: ఏజెన్సీలోని అటవీప్రాంతంలో బాహ్యప్రపంచానికి దూరంగా కనీస వసతులు కరువై జీవనం సాగిస్తున్న గోగుమిల్లి, చింతపల్లి, గడ్డపల్లి, దారావాడ, చిలకలూరు తదితర గ్రామాల్లోని సుమారు 1800 కొండరెడ్డి కుటుంబాలకు బుధవారం నాగ భూషణం, ఎం.రవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఐటీడీఏ పీవో ఆర్‌వి సూర్యనారాయణ చేతుల మీదుగా పంపిణీ చేశా రు. గిరిజనులకు మాస్క్‌లు పంపిణి చేయడంతో పాటు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. కొండకోనల్లో, దట్టమైన అటవీ ప్రాంతంలో అనేక అవస్థలు పడుతూ భుజాలపై నిత్యావసరాలు మోసుకుంటూ వెళ్లారు.

About The Author