భారత్ లో కరోనా సోకిన అత్యంత పిన్న వయస్కురాలు మృతి..


భారత్ లో కరోనా సోకిన అత్యంత పిన్న వయస్కురాలు మృతి..
ఢిల్లీ ఆస్పత్రిలో చనిపోయిన నెలన్నర చిన్నారి
45 రోజుల వయసున్న ఓ చిన్నారి కరోనా కారణంగా మృతి చెందింది. భారత దేశంలో కరోనాతో చనిపోయిన అత్యంత పిన్న వయస్కురాలిగా ఆ చిన్నారిని గుర్తించారు. ఢిల్లీలోని ఢిల్లీలోని కళావతి శరన్ చిన్నపిల్లల ఆస్పత్రిలో ఈ ఘటన జరిగింది. ఐసీయూలో చికిత్స పొందుతూ శుక్రవారమే ఈ పాప చనిపోయింది. అయితే కరోనా టెస్ట్ ఫలితాలు రావడం ఆలస్యం కావడంతో.. తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. పాప తండ్రి కరోనా పాజిటివ్ అని తెలుస్తోంది. కరోనాతో చనిపోయిన చిన్నారితోపాటు.. అదే ఆస్పత్రిలో మరికొంతమంది నవజాత శిశువులు వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తర్వాత వారందరినీ అక్కడినుంచి తరలించి, ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు

About The Author