శానిటేషన్ సిబ్బందితో కలిసి మంత్రి కే.టీ.ఆర్‌ భోజనం..!


మంత్రి కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కు వద్ద గల ఈవీడీఎం యార్డులో పారిశుద్ధ్య, డీఆర్‌ఎఫ్‌, ఎంటమాలజీ సిబ్బందితో కలిసి మంత్రి కేటీఆర్‌ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. లాక్‌డౌన్‌లో పోలీసులకు దీటుగా పనిచేస్తున్నారని.. కరోనా కట్టడికి చేస్తున్న సేవలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.కరోనా నివారణలో భాగంగా సిబ్బంది చేస్తున్న పనులకు చేతులెత్తి సమస్కరిస్తున్నానని కేటీఆర్‌ అన్నారు. కేటీఆర్‌ సహపంక్తి భోజనానికి సంబంధించి ఫోటోలను పురపాలక శాఖ ట్విటర్ వేదికగా ఉంచడంతో . లీడర్‌ అంటే ఇతనే అని, తెలంగాణ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని నెటిజన్లు , టీఆర్ఎస్, కేటీఆర్ అభిమానులు ట్వీట్లు చేశారు.

About The Author