ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్ల రూపాయలు విరాళం..


కోవిడ్‌ –19 నివారణలో భాగంగా సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నియోజకవర్గ ప్రజలు, విద్యాసంస్ధలు, వర్తక, వాణిజ్య సంఘాల తరపున 2 కోట్ల రూపాయలు విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అందజేసిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ, కొట్టు విశాల్‌.

ముఖ్యమంత్రి సహాయనిధికి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రజలు, వైయ‌స్ఆర్‌సీపీ తరపున 1 కోటి 60 లక్షల రూపాయలు. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అంద‌జేస్తున్న ఉండి వైయ‌స్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పి వి ఎల్‌ నరసింహరాజు, పి డి ప్రసాదరాజు(పీఏసీఎస్‌ ఛైర్మన్‌), ఎస్‌ హరివర్మ.

ముఖ్యమంత్రి సహాయ నిధికి కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, పీఏసీఎస్, పీడబ్ల్యూసీఎస్‌ తరపున 1 కోటి 25 లక్షల 116 రూపాయలు విరాళం. కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఉద్యోగుల తరపున 5 లక్షల 60 వేల 600 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎం వైయస్‌జగన్ కు అంద‌జేస్తున్న డీసీసీబీ ఛైర్మన్‌ యార్లగడ్డ వెంకటరావు, పాల్గొన్న మంత్రులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, కైలే అనిల్‌కుమార్‌.

About The Author