సోనియా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు…


కాంగ్రెస్ పార్టీ అధినేత్రి
సోనియా గాంధీ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రిపబ్లిక్ టీవీ ఛానల్ సహ వ్యవస్థాపకుడు అర్నాబ్ రంజన్ గోస్వామి పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఏపి యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి బాల్ రెడ్డి సోమశేఖర్ రెడ్డి గురువారం కలికిరి పోలీస్ స్టేషన్లో ఎస్ ఐ రామాంజనేయులు కు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్రంలో ఈ నెల 16,17తారీఖులలో రాత్రి జరిగిన పార్కర్ మోబ్లించ్ సంఘటన పై అర్నాబ్ రంజన్ గోస్వామి చర్చ నిర్వహిస్తు అందులో అవమాన రకమైన ప్రేరేపించే మరియు పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలను సోనియా గాంధీ పై చేశారని దీనిపై పిర్యాదు చేసినట్లు తెలిపారు. పిర్యాదు ఇచ్చిన వారిలోనాయకులు జెఆర్ రెడ్డి, పఠాన్ ఆదం, పాల్గొన్నారు.

About The Author