ఈ ఫోన్‌ నెంబర్‌ను విస్తృత ప్రచారంలోకి తెద్దాం : మాజీ ఎంపీ శ్రీమతి కవిత


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎవరికైనా భోజనం కావాలనుకుంటే జీహెచ్‌ఎంసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 040- 21111111 కి ఫోన్‌ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌ నంబర్‌ను విస్తృత ప్రచారంలోకి తీసుకురావాల్సిందిగా మాజీ ఎంపీ కవిత నెటిజన్లను కోరారు. లాక్‌డౌన్‌ విపత్కరకాలంలో రాష్ట్రంలో ఏ ఒక్కరు ఆకలితో అలమటిచ్చొందన్న సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎక్కడికక్కడ వలస కూలీలను, నిరుపేదలను ఆదుకుంటున్నారు. తాజాగా సీఎం కార్యాలయం తీసుకువచ్చిన ఈ సౌకర్యం ద్వారా ఏ ఒక్కరు ఆకలితో ఉండరని ఆమె పేర్కొన్నారు.

About The Author