కరోనాపట్ల భయం వద్దు… అజాగ్రత్త వద్దు..


మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేటలోని ఓ ఫంక్షన్‌ హాలులో మున్సిపల్‌ సిబ్బందికి మంత్రి హరీశ్‌రావు గారు సానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సానిటైజర్స్‌ ఇస్తున్నారంటే మున్సిపల్‌ సిబ్బంది బాగుండాలన్న ఆలోచనతోనే. మున్సిపల్‌ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలి. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ పరిస్థితుల్లో అప్రమత్తంగా
ఉండాలి. కరోనాకు ఉపాయాలున్నాయి. మాస్క్ లేకుండా బయటకు రావద్దు. సబ్బుతో రోజుకు నాలుగైదు సార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. బయట నుంచి ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోవాలి, స్నానం చేసి వేరే దుస్తులు ధరించాలి. కరోనా వైరస్ నుంచి బయట పడాలంటే రోజుకు మూడు సార్లు వేడి నీళ్లు తాగండి. చల్లని నీళ్లు తాగవద్దు.

జలుబు అయితే ముఖానికి ఆవిరిపట్టండి. పసుపు నీళ్లతో ఆవిరి పట్టండి. ప్రోటీన్ ఆహారం తీసుకోవాలి, కోడి గుడ్లు, పాలు వంటి ఆహారం తీసుకోవాలి. సిట్రస్ ఉన్న నిమ్మ, సంత్రా, బత్తాయి వంటి పండ్లు తీసుకోండి. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కరోనా పట్ల భయం వద్దు, అలక్ష్యం వద్దు. జాగ్రత్తలు తీసుకోండి. మనల్ని మనం కాపాడుకుంటూ సమాాజాన్ని కాపాడుదాం. పారిశుధ్య పనులు పట్టణాల్లో, పంచాయతీల్లో ఆగకూడదని ప్రభుత్వం పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కింద నిధులు విడుదల చేస్తోంది. కరోనా వచ్చినా ఈ నిధులు ఆపలేదని తెలిపారు.

About The Author