వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లోనూ కరోనా


కర్నూలు జిల్లా కరోనా పాజిటివ్ కేసుల పెరుదలతో ఇప్పుడు హాట్ స్పాట్‌గా మారిపోయింది. రాష్ట్రంలో ఊహించని విధంగా ఇక్కడ ఒక్కసారిగా ఎక్కువ మందికి వైరస్ సోకుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ ఇంట్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆయన కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా సంజీవ్ కుమార్ ప్రకటించారు.

సంజీవ్ కుమార్ తండ్రితో పాటు తన ఇద్దరు సోదరులు, వారి భార్యలు, తమ్ముడి కుమారుడికి ఈ వైరస్ సోకింది. వీరంతా ప్రభుత్వ కరోనా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు ఆయన వెల్లడించారు. 83 ఏళ్ల ఆయన తండ్రి పరిస్థితి కొంచెం సీరియస్‌గా ఉండటంతో ఆయనకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారని సమాచారం.కరోనా సోకిన ఈ ఆరుగురిలో నలుగురు వైద్యులే కావడం విశేషం.

About The Author