ఏపీ అసెంబ్లీ కార్యదర్శి విషయంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం…


ఏపి అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యుల సర్వీసును ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ఆయన పదవీ కాలం ఈ నెల 30న ముగుస్తుంది…

జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి చైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపారు… అయితే, అది నిబంధనలకు విరుద్ధం అంటూ సెలక్ట్ కమిటీ ఏర్పాటుకి అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ ఇవ్వడానికి సుముఖత చూపలేదు… ప్రభుత్వం శాసనసభ కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చి, బెదిరిస్తోందని అప్పట్లో టీడీపీ ఆరోపించింది. అయితే, ఆయన నిబంధనల ప్రకారమే నడుచుకొంటున్నారని అధికార పార్టీ పేర్కొంది…

About The Author