బోరు బావిలో పడ్డ మూడేళ్ల బాలుడు…


మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం..
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పోడ్చన్‌పల్లిలో దారుణం జరిగింది. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు బోరు బావిలో పడ్డాడు. పంట పొలం కోసం తవ్విన బోరుబావిలో.. సాయి వర్థన్ అనే మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవ శాత్తూ పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ప్రస్తుతం 120-150 అడుగుల బోరుబావి లోతులో బాలుడు ఉన్నాడు. వెంటనే సహాయక చర్యలు చేపట్టింది రెస్య్యూటీమ్. అలాగే సంఘటనా స్థలానికి నాలుగు జేసీబీలు చేరుకున్నాయి. పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఎస్పీ చందనా దీప్తి. నీళ్లు పడలేదని బోరుబావిని అలాగే వదిలేశాడు యజమాని. తవ్విన కొద్దిసేపటికే బోరు బావిలో పడ్డ చిన్నారి. కాగా బాలుడిని సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు.

About The Author