ప్రియురాలి మోజులో మొదట భార్యను.. ఆపై ఆమెనూ.!?


అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలోని పత్తికుంట గ్రామానికి చెందిన ఉప్పర రామాంజనేయులుకు.. అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉండేది.

ఇదిలా ఉండగా…మార్చి 24న పట్టుకుంటపల్లిలో తనతో వివాహేతర సంబంధం ఉన్న మహిళను అతడు బండరాయితో తలపై మోదాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను మెరుగైన చికిత్స కోసం
బెంగళూరు తీసుకెళ్తుండగా.. బాధితురాలు మార్చి 25న
మృతి చెందింది.

ఈ కేసులో రామాంజ నేయులును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా నమ్మలేని నిజాలు బయటికొచ్చాయి.

4ఏండ్ల కిందట నుండే అతనికి ప్రియురాలితో వివాహేతర సంబంధం ఉండేది. ఈ విషయం భార్య.. మారక్కకు తెలిసి.. నిలదీసింది.

పథకం ప్రకారం ప్రియురాలితో కలిసి భార్యను
చంపేసి ఇంట్లోనే పాతి పెట్టారు.

అడ్డు తొలగిపోవడంతో ప్రియురాలితో 4సంవత్సరాల నుండి వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు.

ఇదిలా ఉండగా… ప్రియురాలు కొన్ని నెలలుగా (ఆమె పిల్లలు పెరిగి పెద్ద వారవుతున్నారని) అతన్ని పట్టించుకోవడం మానేసింది.

రామాంజనేయులు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ‘నీ కోసం నా భార్యనే చంపేశా. నా మాట వినకపోతే.. నిన్నూ.. చంపేస్తా’ నని బెదిరించాడు.

ఇరువురి మధ్య మాటామాటా పెరగడంతో
మార్చి 24న ప్రియురాలి తలపై బండతో కొట్టి హతమార్చాడు.

విచారణలో ఆ రెండు హత్యలు తానే చేశానని ఒప్పుకున్నాడని సీఐ శ్రీహరి వెల్లడించారు.

About The Author