పరారీలో ఉన్న రౌడీ షీటర్ అరెస్టు…


లాక్ డౌన్ సమయంలో పలు ప్రాంతాలలో తలదాచుకుని పరారీలో ఉన్న స్మగ్లర్లు ను టాస్క్ ఫోర్స్ పట్టుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి శ్రీ రవిశంకర్ గారికి అందిన సమాచారం మేరకు ఒక పలు ఎర్ర చందనం కేసులతో పాటు రౌడీ షీటర్ గా కేసు నమోదయిన నేరస్థుడి అచూకీ తెలిసింది. ఇతనిపై రౌడీ షీటర్ -17 కూడా కేసు నమోదయి ఉంది. ఇతని పేరు రవికుమార్ (35) రైల్వే కోడూరు తాడివాండ్ల పల్లికి చెందిన వ్యక్తి. ఇతను రైల్వే కోడూరు ప్రాంతాలలో ఉన్నట్లు సమచారం రావడంతో ఆర్ ఐ కృపానంద, సివిల్ పీసీ శ్రీహరి బృందాన్ని పంపించారు. ఇతనిని చాకచక్యంగా వల వేసి పట్టుకుని, టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తీసుకుని వచ్చారు. ఇతన్ని విచారించి జుడిషియల్ కస్టడీకి తరలించారు. ఇతనిపై పలు ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి.

About The Author