యాదాద్రిపైకి నడిచే రావాలి…


★ భక్తుల రాకకోసం యాదగిరిగుట్ట సకల సౌకర్యాలతో సన్నద్ధమవుతున్నది.

★ ఈ నెల 8 నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనంతోపాటు ఆర్జిత పూజల నిర్వహణ కోసం భక్తజనానికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

★ కొండ కింద నుంచి భక్తులు కాలినడకన కొండపైకి చేరుకోవాల్సి ఉంటుంది.

★ కొండపైకి ఎలాంటి వాహనాలకు అనుమతివ్వరు.

★ కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన స్వామి దర్శనాలు ఈ నెల 8నుంచి పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో మంగళవారం యాదాద్రిలో వివిధశాఖల అధికారులతో సమావేశమైన యాదాద్రి ఆలయ ఈవో ఎన్‌ గీత ఏర్పాట్లపై సమీక్షించారు.

_*అనంతరం మీడియాతో మాట్లాడుతూ..*_

★ స్వామి దర్శనానికొచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

★ కొండ కింది నుంచి పై వరకు కాలినడకన వెళ్లే భక్తులు భౌతికదూరం పాటించేలా నిర్ణీత బాక్సులను ఏర్పాటుచేశామని పేర్కొన్నారు.

★ ముందుగా వారం పాటు ప్రయోగాత్మకంగా దర్శనాల ప్రక్రియను పర్యవేక్షిస్తామని చెప్పారు.

★ నాడు 250 జంటలు.. నేడు 50 జంటలు.

★ యాదాద్రి కొండపై కరోనాకు ముందు.. శ్రీసత్యనారాయణస్వామి వ్రతాల కోసం ఒక్కో బ్యాచ్‌కు ఒక హాల్‌లో 250 జంటలు కూర్చునేలా అనుమతించేవారమని, కానీ ఈ నెల 8 నుంచి ఒక్కో బ్యాచ్‌లో 50 మంది దంపతులు మాత్రమే కూర్చునేలా ఏర్పాట్లుచేస్తున్నామని ఈవో గీత చెప్పారు.

★ శ్రీవారి కల్యాణం జరిపించుకునేందుకు గతంలో 200 మంది దంపతులను అనుమతించేవారమని, ప్రస్తుతం 25 మంది దంపతులే కూర్చునేలా టికెట్లు ఇవ్వనున్నామని వెల్లడించారు.

★ దర్శనాలు గత టైంటేబుల్‌ ప్రకారమే జరుగుతాయని ఆమె వివరించారు.

_*వారికి అనుమతిలేదు*_

★ దర్శనాలకు పదేండ్లలోపు పిల్లలు, 65 ఏండ్లుపైబడిన వృద్ధులకు అనుమతిలేదని ఈవో గీత స్పష్టంచేశారు.

★ దీనిపై దేవాదాయశాఖ కమిషనర్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని తెలిపారు.

★ అనంతరం ఆమె కొండపై ఏర్పాట్లను పరిశీలించి.. పలు సూచనలుచేశారు.

★ ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త బీ నర్సింహమూర్తి, ఏఈవోలు దోర్బల భాస్కర్‌, ఆకునూరి చంద్రశేఖర్‌, వేముల రామ్మోహన్‌రావు, జూశెట్టి కృష్ణాగౌడ్‌, మేడి శివకుమార్‌, గజవెల్లి రమేశ్‌బాబు, గట్టు శ్రావణ్‌కుమార్‌, రాజన్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

About The Author