నడి రోడ్డుపై వ్యక్తి దారుణ హత్య..అడ్డుకోబోయిన వ్యక్తిపైనా దాడి

అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపారు దుండగులు. అయితే, దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. రహమత్‌ పురంలో ఈ దారుణం జరిగింది. రహమత్‌ పురానికి చెందిన మారున్‌పై  కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి తెగబడ్డారు. అయితే, ఇది చూసిన మారున్‌ సోదరుడు అల్లా బక్ష్ దుండగుల్ని వారించే ప్రయత్నం చేశాడు. దీంతో అతనిపైనా దాడి చేసి పరారయ్యారు దుండగులు. తీవ్రంగా గాయపడ్డ మారున్‌, అల్లా బక్ష్ లను ఆస్పత్రికి తరలించారు స్థానికులు. అయితే, అప్పటికే మారున్‌ చనిపోయినట్టు నిర్ధారించారు డాక్టర్లు. గాయాలైన అల్లా బక్ష్ చికిత్స పొందుతున్నాడు. లాక్‌డౌన్‌ సమయంలో కొంత మంది మాంసం విక్రయిస్తుండడంతో పోలీసులకు సమాచారం అందించాడు మారున్‌. ఈ కారణంగానే తమపై దాడి జరిగిందని మారున్‌ సోదరుడు అల్లా బక్ష్ ఆరోపిస్తున్నాడు.

About The Author