1,60,000 కుటుంబాలకు.. మల్టీ విటమిన్ సిరప్ లు పంపిణీ

తిరుపతి:చంద్రగిరి నియోజకవర్గంలో 1,60,000 కుటుంబాలకు ఒక లక్షా అరవై వేల మల్టీ విటమిన్ సిరప్ లను ఉచితంగా పంపిణీ చేసేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సిరప్ ద్వారా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి కరోనా నియంత్రణకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే చెవిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ముక్కోటి సమీపంలోని నారాయణి గార్డెన్స్ లో మల్టీ విటమిన్ సిరప్ ల పంపిణీ కార్యక్రమాన్ని చెవిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియా తో మాట్లాడారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్పూర్తితో నా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తున్నాను. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో నా నియోజకవర్గ ప్రజలకు అవసరమైన అన్ని రకాల విటమిన్స్ తో కూడిన సిరప్ ను అందించేందుకు చర్యలు చేపట్టాను. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి భౌతిక దూరం పాటిస్తూ   వాలంటీర్ వ్యవస్థ ద్వారా సిరప్ లను పంపిణీ చేయడం జరుగుతుంది. 

About The Author