ట్రక్కు ఢీకొని సుల్తానాబాద్ ఏఎస్ఐ మ‌ృతి

కరీంనగర్: బొమ్మకల్ సమీపంలో రోడ్డుప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై ట్రక్కు-కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఏఎస్ఐ తిరుపతి అక్కడికక్కడే మృతిచెందారు. సుల్తానాబాద్‌లో విధులు ముగించుకుని ఏఎస్ఐ తిరుపతి, కరీంనగర్ కు వస్తుండగా ఈ ఘోరం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించారు.

About The Author