బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడికి పదేళ్ల జైలు..


చార్మినార్‌,:నాలుగో తరగతి చదువుతున్న బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన అదే పాఠశాలకు చెందిన అరబిక్‌ ఉపాధ్యాయుడికి మంగళవారం కోర్టు పదేళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది. బహదూర్‌పుర ఇన్‌సెక్పక్టర్‌ దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 2015 నవంబరు 9న పాతబస్తీ కిషన్‌బాగ్‌ నజమ్‌నగర్‌లోని ప్రైవేటు పాఠశాలకు వచ్చిన నాలుగో తరగతి విద్యార్థికి.. ఆ పాఠశాలకు చెందిన అరబిక్‌ ఉపాధ్యాయుడు మహ్మద్‌ మునీరుద్దీన్‌(32) పుస్తకాలు ఇస్తానని సమీపంలోని అతని ఇంటికి తీసుకెళ్లాడు. మునీరుద్దీన్‌ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికి చెప్పవద్దని బెదిరించి బాలుడిని పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. మరుసటి రోజు బాలుడు విషయాన్ని తండ్రికి చెప్పగా బహదూర్‌పుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మునీరుద్దీన్‌ మరికొందరు బాలురపై కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు పూర్వాపరాలను పరిశీలించిన అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్‌ కోర్టు న్యాయమూర్తి సునీత కుంచలా నిందితుడు మునీరుద్దీన్‌కు పదేళ్ల జైలు శిక్షణ విధించారు.

About The Author