ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దుశ్చర్య

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. సుక్మా జిల్లాలోని కుకనార్‌లో రోడ్డు నిర్మాణసంస్థకు చెందిన వాహనాలను తగులబెట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న రెండు పొక్లెయిన్లతో సహా  6 వాహనాలను మావోయిస్టులు దగ్ధం చేశారు. ఆర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ఘటనకు పాల్పడ్డారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు స్థానిక పోలీసు అధికారులు వెల్లడించారు.

About The Author