నాడు- నేడు నాలుగు స్కూల్స్ జరుగుతున్న పనులు పరిశీలన

నాణ్యతతో కూడిన పనులు త్వరగా పూర్తి చేయండి

చెన్నా రెడ్డి కాలనీ వార్డు సచివాలయం ఆకస్మిక తనిఖీ

నగరపాలక సంస్థ కమిషనర్ గిరీష

తిరుపతి:మనబడి: నాడు-నేడు  జరుగుతున్న పనులు కమిషనర్ గిరీష అధికారులతో శుక్రవారం సాయంత్రం జడ్పీ హైస్కూల్ ఎంఆర్ పల్లి వద్ద జరుగుతున్న నాడు నేడు పనులు పరిశీలించి ఎం ఈ ఓ ను జూలై మాసంలో పూర్తిచేయాలని ప్రతి పనిలో నాణ్యత తో  ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ హైస్కూల్ తంబు వాని గుంట వద్ద పనులను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని, పనులు జరిగేటప్పుడు ఇంజనీరింగ్ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పనులు జరిగే ప్రదేశాలలో దగ్గర ఉండి ఎప్పటికప్పుడు పనులు పూర్తిచేసే విధంగా ఉండాలని తెలియజేశారు. జడ్పీ హైస్కూల్ సత్యనారాయణపురం వద్ద జరుగుతున్న పనులు పరిశీలించి మొదటి విడత జరుగుతున్న పనులు ప్రధానోపాధ్యాయులు, అధికారులు మరియు తల్లిదండ్రుల కమిటీ పర్యవేక్షణలో జరగాలని తెలియజేశారు. మున్సిపల్ హైస్కూల్ మాల్వా జి స్కూల్ పోలీస్ క్వార్టర్స్ వద్ద ఉన్న స్కూలు పరిశీలించి జరుగుతున్న పనులు ఎప్పటికప్పుడు అధికారులు దృష్టికి తీసుకురావాలని మరియు త్వరగా పూర్తిచేసి ఆదర్శంగా నిలవాలని తెలియజేశారు.

About The Author