అక్రమంగా బీరు బాటిల్స్ తరలిస్తున్న యువకులు అరెస్ట్

ఎస్ ఆర్ పురం  : తమిళనాడు నుంచి అక్రమంగా కింగ్ ఫిషర్ బీర్ బాటిల్స్ తరలిస్తున్న యువకులను అరెస్టు చేసిన ఘటన మండలంలో చోటుచేసుకుంది .ఎస్ఐ శ్రీనివాసరావు పాత్రికేయులకు తెలిపిన వివరాల మేరకు… ఆదివారం సానా కుప్పం చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా జిఎంఆర్ పురం గ్రామానికి చెందిన రమేష్ ,దాము ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం పై తమిళనాడుకు చెందిన కింగ్ ఫిషర్ 9 బీరు బాటిల్స్ తీసుకు వస్తుండగా  స్వాధీనం చేసుకుని, యువకులను అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

About The Author