హైదరాబాద్‌లో గుండెపోటుతో మరో డీఎస్పీ మృతి

హైదరాబాద్: నగరంలో గుండెపోటుతో మరో డీఎస్పీ మృతి చెందారు. ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌లో డీఎస్పీగా విధులు నిర్వర్తిస్తున్న రాజేంద్ర కులకర్ణి శుక్రవారం గుండెపోటుతో చనిపోయారు. కులకర్ణి 1995 బ్యాచ్‌కు చెందిన అధికారి. కాగా, కొద్ది రోజుల క్రితం అదే బ్యాచ్‌కు చెందిన ఏసీబీ డీఎస్పీ ప్రతాప్ గుండె పోటుతో మృతి చెందారు. కొద్ది రోజుల వ్యవధిలోనే మరొక డీఎస్పీ మృతి చెందడంతో డిపార్ట్‌మెంట్‌లో విషాద చాయలు అలముకున్నాయి.

About The Author