తెలంగాణకు చెందిన సునీత నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య

తిరుపతి రూరల్ పరిధిలోని లింగేశ్వర నగర్ లో ఘటన.

సంఘటనా తిరుచానూరు పోలీసులు.

తిరుచానూరు: తిరుపతి గ్రామీణ మండలం అవిలాల పంచాయతీ ఎంకే నాయుడు నగర్‌లో శనివారం ఓ వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది. తిరుచానూరు పోలీసుల కథనం మేరకు.. అవిలాలకు చెందిన గురునాథం ఏడాది క్రితం తెలంగాణ రాష్ట్రం హన్మకొండలో పెట్స్‌ కంట్రోలర్‌గా పనిచేశాడు. అదే సమయంలో అక్కడ తనతో కలిసి పని చేసిన సునీత(30)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత ఆరు నెలలుగా దంపతులిద్దరూ కలిసి ఎంకే నాయుడు కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సునీత ఉరివేసుకుని మృతి చెందినట్లు భర్త గురునాథం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ వివాదం నడుస్తునట్లు మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సునీత మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తిరుచానూరు సీఐ సుధాకర్‌రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

About The Author