మంత్రి బాలినేని వాహనానికి ప్రమాదం.. హెడ్‌కానిస్టేబుల్ మృతి

హైదరాబాద్: పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్‌పై ఘోర ప్రమాదం జరిగింది. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనం టైర్ బ్లాస్ట్ కావడంతో బొలెరో వాహనం పల్టీలు కొడుతూ కిందపడింది. ఈ ప్రమాదంలో హెడ్‌‌కానిస్టేబుల్ పాపయ్య మృతిచెందగా.. మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గచ్చిబౌలి నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

About The Author