పేదలకు భరోసాగా.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు

22 మంది బాధితులు.. రూ.11.20 లక్షలు:

చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి:

తిరుపతి, 2020 జూలై 28: ఆపత్కర కాలంలో నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు భరోసాగా నిలుస్తున్నాయని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన 22 మంది బాధితులకు రూ.11.20 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను చెవిరెడ్డి అందజేశారు. కరోనా పరిస్థితుల్లో సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుందని అనుకోలేదు. మా ఎమ్మెల్యే చొరవ తీసుకొని, మా పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి మాకు సాయం అందించేలా కృషి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి, ఎమ్మెల్యే చెవిరెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు.

About The Author