మనసు మమత సీరియల్ నటి శ్రావణి సూసైడ్..

మనసు మమత నటి శ్రావణి… సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. లవ్ ఫెయిల్యూరే కారణమని సమాచారం. మధురానగర్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి ఉరివేసుకొని చనిపోయారు. మనసు మమత, మౌనరాగం సీరియల్స్‌లో శ్రావణి నటించారు. శ్రావణి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తరచూ ఇలా సినీ, టీవీ నటులు ఆత్మహత్యలు చేసుకోవడం, తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం కలకలం రేపుతోంది. శ్రావణి మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఆత్మహత్యే అని అనుకుంటున్నా… పోలీసులు ఇంకా నిర్ధారణకు రాలేదు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు రాశారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తామంటున్నారు.

About The Author